సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భీమ్లానాయక్ ” మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “భీమ్లానాయక్ ” మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. “భీమ్లానాయక్ “మూవీ ను అల్లు అర్జున్ వీక్షించారు. పవన్ సహా ఇతర చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారు.
కొంచెం లేట్ అయ్యాననీ , అయితే… పవన్ కల్యాణ్ గారు, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ గారు, దర్శకుడు సాగర్ చంద్ర, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, నిర్మాత నాగవంశీ, ఇతర చిత్రబృందానికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అనీ , ‘భీమ్లా నాయక్’ భారీ బ్లాక్ బస్టర్ సాధించిందనీ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: