అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అదుర్స్ “మూవీ ఘనవిజయం సాధించింది. నయనతార , షీలా కథానాయికలు. బ్రహ్మానందం , ఎమ్ ఎస్ నారాయణ , మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్థి , రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో ఎన్టీఆర్ చారి , నరసింహా క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చారి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కామెడీ ని అద్భుతంగా పండించారు. ఎన్టీఆర్ – బ్రహ్మానందం , బ్రహ్మానందం – ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయించాయి. ప్రతీ క్యారెక్టర్ కు కామెడీ టచ్ ఇచ్చి దర్శకుడు వినాయక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “అదుర్స్ “మూవీ ని తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ కు సీక్వెల్ మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో ఎన్టీఆర్ సీక్వెల్ మూవీ పై కామెంట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తాను నటించిన చిత్రాల్లో ఒక సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటే “అదుర్స్ “మూవీ అనీ , తన కెరీర్ లో ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ చిత్రం “అదుర్స్”అనీ , ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ పై హిట్టేననీ , “అదుర్స్ “మూవీ సీక్వెల్ లో నటించాలని ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: