టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్ హీరోగా కొత్త సినిమా రాబోతుంది. కరోనా సమయంలో ‘థ్యాంక్ యు బ్రదర్’ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విరాజ్ అశ్విన్. ఆ తరువాత వేరే సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అనుప్రసాద్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ హీరోగా జోరుగా హుషారుగా సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈసినిమా మరో కీలక పాత్రలో నటిస్తున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి కుమార్ మాట్లాడుతూ.. టైటిల్కి తగినట్లుగా హుషారైన టీమ్తో పని చేశాను. ఎస్.ఆర్. కళ్యాణమండపం చేశాక కొత్త దర్శకులు భిన్నంగా ఆలోచిస్తూ పాత్రలు ఇస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు. విరాజ్ను ఓటీటీలో చూశాక బాగా చేశాడనిపించింది. తను మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు అని తెలిశాక ఆనందం కలిగింది. కొత్త తరంతో న్యూ ట్రెండీ ఫిలిం ఇది అని తెలిపారు.
కాగా ఈసినిమాలో పూజిత పొన్నాడ, సోను ఠాకూర్, మధునందన్, సిరి హనుమంతు, క్రేజీ కన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సాయి కుమార్, రోహిణి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సతీష్ సరేపల్లి, జెమిని సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. ప్రణీత్ సంగీతం అందిస్తుండగా.. మహి రెడ్డి పండుగల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: