ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయిస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక తాజాగా ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూజా సౌత్ ఇండస్ట్రీపై.. అలాగే తనకు ఇలాంటి స్ట్రాంగ్ కథానాయిక పాత్రలు ఇస్తున్న ఫిలిం మేకర్స్ పై ప్రశంసలు కురిపించింది. ఇక ఈ సందర్భంగా తనకు పవర్ ఫుల్ లేడీ పాత్రల్లో నటించాలని ఉందని అంటుంది ఈ బుట్టబొమ్మ. ఒక అమ్మాయిగా సీత ఔర్ గీత సినిమాలో హేమా మాలిని రౌడీలను కొట్టినప్పుడు కానీ.. మిస్టర్ అండ్ మిస్ తరహా యాక్షన్ సినిమాలు ఏంజెలీనా జోలీ లాంటి హీరోయిన్ చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి పాత్రలు చేయాలని చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది అని చెప్పింది. అంతేకాదు ఒక ఫుల్ యాక్షన్ ఫిలిం చేయాలని ఉందని.. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ పాత్రలు చేయాలని తన కోరికను తెలియచేసింది.
మరి ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్లుగా రాణించిన సమంత అలానే నయనతార ఇంకా పలు స్టార్ హీరోయిన్లు లేడీ ప్రధానమైన పాత్రలు చేసి హిట్లు కొట్టారు. మరి పూజా హెగ్డే కోరిక మేరకు తనకు కూడా అలాంటి పాత్రలు ఏమైనా భవిష్యత్తులో వస్తాయేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: