టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “రాధేశ్యామ్” మూవీ మార్చి 11 , “ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరోస్ కమల్ హాసన్ , ధనుష్ లతో నటించాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: