కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక థర్డ్ వేవ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీలకు కరోనా సోకగా.. ప్రస్తుతం థర్డ్ వేవ్ ప్రభావం అంతగా లేకపోయినా రీసెంట్ గా శృతి హాసన్ కూడా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే శృతీ క్వారంటైన్ లో ఉండి విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే శృతీకి ఇంట్లో ఉంటూ బోర్ కొడుతున్నట్టు ఉంది.. అందుకే తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేస్తూ.. చాలా అలిసిపోయాను అని చెబుతూనే.. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీఎంట్రీ తరువాత శృతీ హాసన్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో వకీల్సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక దీనితో పాటు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సినిమాలతో పాటు శృతీ వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఇటీవలే తను నటించిన బెస్ట్ సెల్లర్ ’ వెబ్ సిరీస్ విడుదలై సక్సెస్ఫుల్గా నడుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: