టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ చేయగా.. టీజర్ లో ఉన్ని కృష్ణన్ టీనేజ్ నుంచి ఆర్మీ ఆఫీసర్గా ఎదిగిన క్రమాన్ని చూపించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్నారు. దీనిలో తాజాగా మరో అప్డేట్ను ఇచ్చారు అడివి శేష్. తను డబ్బింగ్ పార్ట్ను స్టార్ట్ చేసేసినట్టుగా తెలుపుతూ ఈ మేరకు మైక్ ముందు ఉన్న ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: