2004 సంవత్సరం నవంబర్ 18 వ తేదీ ధనుష్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ జనవరి లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త విని రజినీకాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ… జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయనీ , వాటిని తప్పకుండా ఎదుర్కొవాలనీ, ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ అనీ , ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమనీ , ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదనీ, తాను ఎదిగేకొద్దీ తన మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చిందనీ , తాను తన తల్లిదండ్రులను, పిల్లలను ప్రేమిస్తున్నాననీ , ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదనీ చెప్పారు. ఎక్కడా ధనుష్ ప్రస్తావన లేకుండా , ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య అనడం చూస్తుంటే ఇక వీరిద్దరు మళ్లీ కలిసే అవకాశం లేనట్టే అని అర్ధమవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: