ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఇక ఉప్పెన తరువాత చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఉప్పెన సినిమా తరువాత కొండపొలం లాంటి సినిమాను తీసి ఆ సినిమాతో కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఇప్పుడు లవర్ బాయ్ పాత్రతో వచ్చేస్తున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. టైటిల్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్కి, టైటిల్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ”తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో” అంటూ సాగే పాటకు ట్రెమండస్ అప్లాజ్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వేసవి కానుకగా మే 27న `రంగ రంగ వైభవంగా` సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Get Ready to meet Rishi & Radha❤️ in Theaters near you!#RangaRangaVaibhavanga in theaters from May 27th!
A Rockstar @ThisIsDSP Musical 🎹
Directed by @GIREESAAYA
#RRVonMay27#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP @SonyMusicSouth pic.twitter.com/FB98jtkN4b— SVCC (@SVCCofficial) February 11, 2022
కాగా ఈసినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: