రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ చాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమంలో డీజే టిల్లు హీరో, హీరోయిన్ కూడా పాల్గొని మొక్కలు నాటారు. ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో సిద్దూ,నటి నేహశెట్టి ఇద్దరూ మొక్కలు నాటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సిద్దూ, నేహశెట్టి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేస్తున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. అనంతరం సిద్దూ తన స్నేహితులు ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక, మీనాక్షి చౌదరికి చాలెంజ్ విసరగా నేహశెట్టి మరో ముగ్గురు డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత నాగవంశీ, నటుడు ప్రిన్స్ కి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.
కాగా సిద్దూ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమాను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విమల్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. థమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: