రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అదే జోష్ తో తన కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాను గత ఏడాదే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 16 నుండి ఈసినిమా షూటింగ్ ను తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో మొదలుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. మరి అటు బాలకృష్ణ అఖండతో.. అలానే గోపీచంద్ క్రాక్ తో ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించబోతున్నాడు గోపీచంద్. ఇప్పటికే ఈసినిమాకోసం రీసెర్చ్ కూడా బాగానే చేశాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: