యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క , రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “మిర్చి ” మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 6 నంది అవార్డ్స్ అందుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. “మిర్చి “మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరటాల శివ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఇదేదో బాగుందే , పండగలా , డార్లింగే సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రోజు తో “మిర్చి “మూవీ 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా యు వి క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మా వెరీ స్పెషల్ బ్లాక్ బస్టర్ “మిర్చి “మూవీకి అద్భుతమైన 9 ఇయర్స్అంటూ ట్వీట్ చేసింది. “మిర్చి “మూవీతో దర్శకుడిగా జర్నీ ప్రారంభించిన కొరటాల శివ “శ్రీమంతుడు , “భరత్ అనే నేను”, “జనతా గ్యారేజ్ “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: