పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక , శర్వానంద్ జంటగా తెరకెక్కిన “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ , అల్లుఅర్జున్ “పుష్ప :ది రూల్ “టాలీవుడ్ మూవీ స్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.“పుష్ప :ది రైజ్ ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో రష్మిక పై క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ లో రష్మిక కు పలు మూవీ ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. గత సంవత్సరం ఫిబ్రవరిలో రష్మిక ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. బాలీవుడ్లో సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండేందుకు ఇప్పుడు ప్లాన్ చేశారనీ , త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నట్లు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: