సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు రిపోర్టర్స్ నుండి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతుంటాయి హీరో హీరోయిన్స్ కు. ఇక కొంతమంది వాటిని ఇగ్నోర్ చేస్తే.. కొంతమంది ఓపికగా సమాధానం చెబుతుంటారు. ఇకఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది యంగ్ హీరో సిద్దూకి. సిద్దూ హీరోగా వస్తున్న కొత్త సినిమా డీజే టిల్లు. ఇక ఈసినిమా ఈనెలలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ రిపోర్టర్ సిద్దూను ప్రశ్న అడుగగా దానిని సిద్దూ చాలా స్మూత్ గా రిజక్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు దానిపై సోషల్ మీడియా ద్వారా సిద్దూ క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. నా కొత్త చిత్రం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒక ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపైనే చెప్పాను. అయితే నేను అలా స్పందించడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలా కూల్ అండ్ కంపోజ్డ్ పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నా కోపాన్ని బయటకి చూపించకుండా కంట్రోల్లో ఉండాలనుకున్నా. అంతేకాని దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలనుకోలేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే యాక్టర్స్ ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేస్తారనుకోవడం లేదు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాదు నటీనటులను గౌరవించండి.. ఇది నా రిక్వెస్ట్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు.
A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022
కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమాలో సిద్దూ హీరోగా నటించడమే కాదు ఈసినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: