భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచం అంతటా చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్ కి దూరమైనా ఐపీఎల్ ద్వారా అభిమానులని అలరిస్తున్నాడు. క్రికెట్ తో పాటు వేరే గేమ్స్, సాహస కార్యక్రమాలు, బైక్ రైడింగ్స్, యాడ్స్ …వంటి వాటితో అభిమానులను అలరిస్తున్న ధోని ఇప్పుడు మరో కొత్త అవతారంలో పలుకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ సంగీత దర్శకుడు రమేష్ తమిళ్మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల “అధర్వ: ది ఆరిజిన్” లో ధోని హీరో పాత్రలో కనిపించనున్నారు. ఇది కేవలం గ్రాఫిక్ నవల మాత్రమే. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి ఈ గ్రాఫిక్ నవల రానుంది. తాజాగా ‘అథర్వ – ది ఆరిజిన్’ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ధోని మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్తో కలిసినందుకు తాను చాలా థ్రిల్ అవుతున్నాననీ , ఇది నిజంగా అద్భుతమైన వెంచర్ అనీ , “అథర్వ : ది ఆరిజిన్” అనేది ఆకర్షణీయమైన కథ అనీ, ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: