గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణం ఒక్క కన్నడ పరిశ్రమనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీనే షాక్ కు గురిచేసింది. ఇక పునీత్ కు టాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే పునీత్ మరణంతో చాలామంది విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రామ్చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇక అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్లిన ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
My Humble respects To Puneeth Garu . My respect to the rajkumar garu’s family , friends , well wishers & fans . pic.twitter.com/6qRzv4NyX4
— Allu Arjun (@alluarjun) February 3, 2022
అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. ఇక పుష్ప2 షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: