కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గత రెండు వారాల్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక దీనిలో భాగంగానే సర్కారు వారి పాట టీమ్ లో ముగ్గురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ముందు సూపర్ స్టార్ మహేష్ తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని తెలుపగా.. ఆ తర్వాత థమన్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. వారిద్దరి తర్వాత కీర్తి సురేష్ కూడా రీసెంట్ గానే తనకు కూడా కరోనా నిర్థారణ అయిందని తెలిపింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని.. జాగ్రత్తగా ఉండండి..అందరూ వ్యాక్సిన్లు వేసుకోండి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక వీరిలో ఇప్పటికే థమన్, మహేష్ బాబులు అయితే ఇప్పటికే కోలుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా కీర్తి సురేష్ కూడా తను కోలుకున్నట్టు తెలుపుతుంది. నేడు తన ట్విట్టర్ ద్వారా కీర్తి సురేష్ తన హెల్త్ గురించి అప్ డేట్ ఇచ్చింది. నెగిటివ్ అనేది ఈరోజుల్లో పాజిటివ్ అయిందని.. తనకు కరోనా నెగిటివ్ అని చెబుతూ.. అందరి ప్రేమ, ప్రార్ధనలకు థ్యాంక్స్..ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
‘Negative’ can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా భోళా శంకర్ సినిమాలో అలానే నాని హీరోగా రాబోతున్న దసరా సినిమాలో కూడా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ అలానే మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: