బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి డాటర్ సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “ఉయ్యాల జంపాల “, “మజ్ను ” మూవీస్ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ నిర్మించనున్నారు. మోడరన్ యువతి చుట్టూ సాగే కథ తో తెరకెక్కనున్న ఈ మూవీ లో కథానాయికగా కృతి శెట్టి ఎంపిక అయ్యారు. స్టార్ హీరోయిన్ అనుష్క తన 12 వ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ “అరుంధతి ” లో నటించగా కృతిశెట్టి తన 6 వ మూవీ కే లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: