పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ప్లాన్ లోనే ముందు నుండి ఉన్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వల్ల ఈసంక్రాంతికి రాలేకపోయింది. కొన్నాళ్లు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఆ తరువాత షూటింగ్ ను మొదలు పెట్టి దాదాపు చాలా వరకూ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మధ్య మధ్యలో ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి బ్లాస్టర్ పేరుతో రిలీజ్ అయిన వీడియో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే గత కొద్దిరోజులుగా షూట్ కు మళ్లీ బ్రేక్ పడింది. మహేష్ మోకాలికి చిన్న సర్జరీ లాంటిది జరగడంతో ఆయన ప్రస్తుతం రెస్టింగ్ మోడ్ లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు చిత్రయూనిట్. నేపథ్యంలోనే ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ తన ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ పరశురామ్ తో దిగిన ఒక ఫోటో ను షేర్ చేస్తూ.. ఈ సినిమా పాటలను త్వరలో మీరు వింటారు.. సినిమా కోసం టీమ్ అంతా కూడా కష్ట పడుతోంది అంటూ అప్ డేట్ ఇచ్చాడు. ఇక దీనికి మైత్రీ మూవీ మేకర్స్ వారు రిప్లై ఇస్తూ సంక్రాంతి నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు.
#SarkaruVaariPaata
UPDATES
from Sankranti ❤️ https://t.co/QuWGSVMx78— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2022
కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: