పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి బాహుబలి, సాహో సినిమాల తరువాత ప్రభాస్ మార్కెటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు ప్రభాస్ సినిమాలు చేయడానికి కేవలం తెలుగు నుండే కాదు నార్త్ లో కూడా పోటీ పెరిగింది. ఇక నార్త్ లో కూడా ఎంతోమంది ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీ పడగా ఆ అవకాశం మాత్రం ఓం రౌత్ కు మాత్రమే దక్కింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆది పురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తనకు ఈ అవకాశం వచ్చినందుకు మరోసారి ఓం రౌత్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. నిజానికి ప్రభాస్ కనుక ఈసినిమాను ఒప్పుకోకపోతే ఈసినిమా చేసుండేవాడిని కాదు.. మొదటి సారి ప్రభాస్ ను కలవడానికి వెళ్లినప్పుడు ఏదో సూపర్ స్టార్ ను కలుస్తున్నా అన్న ఫీలింగ్ తో వెళ్లాను కానీ ప్రభాస్ ను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది.. చాలా ఒదిగి ఉండే మనిషి.. ప్రభాస్ పై నాకు చాలా నమ్మకం ఉంది.. అంతేకాదు తను చాలా డెడికేటెడ్ పర్సన్ అంటూ ప్రశంసలు కురిపించాడు ఓం రౌత్.
కాగా ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: