సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 8 సంవత్సరాల తరువాత రాశీఖన్నా ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశిఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా నటిస్తున్నారు. బాలీవుడ్ లో తన జర్నీ గురించి రాశీఖన్నా మాట్లాడుతూ .. కెరీర్ ప్రారంభంలో కథల్ని ఎంపిక చేసుకునే స్వేఛ్చ ఉండేది కాదనీ , ఇప్పుడు మంచి కథలతో ఆఫర్స్ వస్తున్నాయనీ , ప్రతీ పాత్రా సవాలుగా అనిపిస్తుందనీ , నటిగా తనలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించుకొనే పాత్రలు దొరకడం అదృష్టం గా భావిస్తున్నా ననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: