కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మరోవైపు స్టార్ట్ చేసి అవి కూడా పూర్తి చేస్తున్నాడు కృష్ణవంశీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్ లో బ్రహ్మానందం కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవ్వనుండగా మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్రబృందం.
ఇక ఈ సినిమాలో అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: