సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత చిన్న వయసు లోనే సంగీత శిక్షణ తీసుకుని పలు మ్యూజిక్ కాంపిటీషన్స్ లో పాల్గొని అవార్డ్స్ , ప్రశంసలు అందుకున్నారు. 17 సంవత్సరాల వయసు లో ప్లే బ్యాక్ సింగర్ గా సునీత “గులాబి ” మూవీ లో శశి ప్రీతమ్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన “ఈ వేళలో నీవు ” సాంగ్ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీస్ తో పాటు పలు సీరియల్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్న సింగర్ సునీత జనవరి 8 వతేది ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ తో కలసి హైదరాబాద్ మాదాపూర్ లో “మెలోడిఎస్ మూమెంట్ విత్ సునీత” పేరుతో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ .. సంగీతం మానసిక ఉల్లాసం కలిగించడం తో సహా మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందనీ , ఇప్పటి వరకూ తాను పాడిన సాంగ్స్ ను వినూత్న రీతి లో సంగీత ప్రియులకు వినిపించనున్నట్టూ , “మెలోడిఎస్ మూమెంట్ విత్ సునీత” ఈవెంట్ తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: