హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే మహాసముద్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. టీజర్ ను 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Wait for it 😊#OkeOkaJeevitham pic.twitter.com/TSnLfgnsw2
— Sharwanand (@ImSharwanand) December 27, 2021
కాగా ఈసినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: