ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ మోకాలికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. నిజానికి మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సర్కారు వారి పాట తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. అయితే మహేష్ సర్కారు వారి పాట కంప్లీట్ అయిన తరువాత ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో లేట్ అయింది. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా మహేష్ ఒక ఫొటో షేర్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. `వర్క్ అండ్ చిల్.. ప్రొడక్టీవ్ ఆఫ్టర్ నూన్` అంటూ దుబాయ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, థమన్లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు మహేష్. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Work and chill… productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW
— Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021
ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో అతడు హిట్ అవ్వగా.. ఖలేజా మాత్రం నిరాశపరిచింది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఇప్పటికీ చాలామందికి ఖలేజా సినిమా నచ్చుతుంది. మరి ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి రాబోతున్నారు. ఈసారి ఎలాంటి కథతో వస్తారో వేచి చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: