పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోస్ కు మామిడి పండ్లు, పలు గిఫ్ట్స్ పంపిస్తూ సర్ ప్రైజ్ ఇస్తుంటాడు. ఈనేపథ్యంలో రీసెంట్ గానే దీపావళి బహుమతులు పంపిన పవన్.. తాజాాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా స్పెషల్ గ్రీటింగ్స్ చెబుతూ గూడ్స్ పంపించారు. దీనిలో భాగంగానే తాజాగా మరోసారి మహేష్ బాబు దంపతులను సర్ ప్రైజ్ చేశారు పవన్ ఫ్యామిలీ. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ మరియు తన భార్య అన్నా మహేష్ కుటుంబానికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ ని పంపించారు. దీనితో ఈ గ్రీటింగ్స్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ ఈ లవ్లీ హాంపర్ ని పంపినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఏప్రిల్ లో ఈసినిమా రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.. ఈసినిమా నిజానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఇంకా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. వీటితోపాటు హరీష్ శంకర్ సినిమా కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: