ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకు అల్లు అరవింద్ గారు ఫోన్ చేసినప్పుడు మళ్లీ లవ్ స్టోరీనా అన్నాను.. అయితే ఇది కొంచం డిఫరెంట్.. ఫ్రెష్ గా ఉంటుంది అని అనడంతో చేశాను. ఇకపై లవ్ స్టోరీస్ కు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను.. మా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా లవ్ స్టోరీస్ చేసేశారు.. లవ్ స్టోరీస్ అంటే ఏదో బోర్ కొట్టి తీసుకున్న నిర్ణయం కాదు ఇది.. కొత్తగా ట్రై చేయడానికి.. ఆ ప్యాట్రన్ కు కాస్త బ్రేక్ ఇవ్వాలని అంతే. నేను ప్రస్తుతం చేస్తున్న ఏజెంట్ సినిమా డిఫరెంట్ మూవీ. ఇకపై చేసే సినిమాలు కూడా కొత్తగా ఉండటానికే ట్రై చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాలో మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: