పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. గతకొద్ది కాలంగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. అసలు సంగతేంటంటే.. రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ తో అలరించగా పలు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అందులో ఒక సినిమా భీమ్లానాయక్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశారు. దానికి తోడు టీజర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమా కోసం అటు పవన్ అభిమానులు.. ఇటు రానా అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు ఈసినిమా సంక్రాంతికి వచ్చేస్తుంది కదా చూసేద్దాం అని అనుకుంటుండగా తాజాగా రిలీజ్ డేట్ ను మారుస్తూ షాకిచ్చారు మేకర్స్. నిజానికి ఈసినిమా వాయిదా పడనున్నట్టు ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చినా మేకర్స్ మాత్రం వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. కానీ ఫైనల్ గా రిలీజ్ డేట్ ను మార్చాల్సి వచ్చింది. ఈసినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరికి షిఫ్ట్ చేశారు. ఫిబ్రవరి 25న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: