పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అతిథి దేవోభవ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ప్రపంచంలో ఎవరికైనా మన లోపం గురించి చెప్పుకుంటే… వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోగా… ఆ లోపాన్ని చూసి ఆనందిస్తారని ఆ రోజే నాకు అర్థమైంది అంటూ ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. యాక్షన్ తో పాటు లవ్ యాంగిల్ ను కూడా ఈ టీజర్ లో చూపించారు. లాస్ట్ లో రాముడికి లక్ష్మణుడు వెంటున్నట్టు నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
Intriguing Teaser of #AadiSaiKumar‘s #AtithiDevobhava💥 out now on @telugufilmnagar!
▶️ https://t.co/WHQfkbVPSb#Nuveksha #PolimeraNageshwar #KarthikSrinivas #SekharChandra @AMARNATH_DOP #MiryalaRajababu #MiryalaAshokReddy #SamBollepalli @Srinivasa_Cine pic.twitter.com/K6sqeeuqwq
— Telugu FilmNagar (@telugufilmnagar) December 21, 2021
ఇక ఈసినిమాలో ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈసినిమాకు.. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: