క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈసినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా ఇంతవరకూ మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈమధ్య సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ రీస్టార్ట్ చేయలేదు. ఇక దీనిపై క్లారిటీ ఇచ్చాడు క్రిష్. తాజాాగా ఈసినిమా గురించి క్రిష్ తన ట్విట్టర్ వేదికగా అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా హరిహర వీరమల్లుతో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్.. అమెజింగ్ డే.. కొత్త ఏడాదిలో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
An amazing day of Script reading session with one and only #HariHaraVeeraMallu 📖
Gearing up to commence an exciting schedule in the new year 🎥 pic.twitter.com/Z0GTg1FIzY
— Krish Jagarlamudi (@DirKrish) December 20, 2021
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వెలిన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: