అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు అడివి శేష్ తన పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా అడివి శేష్ కు ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అడివి శేష్ కు బర్త్ డే విషెస్ అందించారు.
Happy birthday, #Major @AdiviSesh! May this be your best one yet!! 😊 pic.twitter.com/oTZMdUrrGE
— Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2021
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: