సినిమా పూర్తయిన తరువాత కానీ.. సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత కానీ హీరో హీరోయిన్స్ చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అప్పట్లో ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్లం.. కానీ ఈమధ్య హీరో హీరోయిన్స్ కూడా అది మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టీమ్ కు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అత్యంత ఖరీదైన రాడో వాచీలను ఆదిపురుష్ టీమ్ కు బహుమతిగా ఇచ్చాడు.
కాగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























