సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్ , సునీల్, అనసూయ ముఖ్య పాత్రలలో నటించగా , స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రష్మిక ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. “పుష్ప: ది రైజ్” మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్.. స్పెషల్గా ఏదైన పంపించాలనిపించింది. అందుకే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మీ కోసం’ అంటూ చేతితో రాసి నోట్తో పాటు కొన్ని వస్తువులను బాక్స్లో పెట్టి రష్మిక పంపించారు.అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో రష్మికకు ధన్యవాదాలు తెలిపారు. “పుష్ప” మూవీ షూటింగ్లో ఉపయోగించిన చిన్న చిన్న వస్తువులను అందంగా అలంకరించి రష్మిక గిఫ్ట్ పంపినట్లు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: