సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో అనసూయ రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “ఫ్లాష్ బ్యాక్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనసూయ ఇప్పుడు చిరంజీవి”గాడ్ ఫాదర్ ” మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన అనసూయ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ .. “ఖిలాడి” మూవీలో ట్విస్ట్ లతో ఉన్న తన పాత్ర తనను ప్రేరేపించిందనీ , పలు రకాల షేడ్స్ ఉన్న తన పాత్రను ఆసక్తి కలిగించేలా దర్శకుడు తెరకెక్కించారనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: