వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈసినిమా కంటే లేట్ గా మొదలైన సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి కానీ ఈసినిమా రిలీజ్ మాత్రం పలు కారణాలవల్ల ఆలస్యం అయింది. రీసెంట్ గానే మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. అయితే గత కొద్దికాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇటీవల ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన నారప్ప ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈసినిమా కూడా ఆదే బ్యానర్ లో వస్తుండటంతో విరాటపర్వం కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్నో రోజుల సస్పెన్స్ తర్వాత దృశ్యం2 కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు ఆవార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల ఈవార్తలపై స్పందించి ‘విరాటపర్వం’ థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు రిలీజ్ డేట్ను కూడా త్వరలో ప్రకటించనున్నామని తెలిపాడు. మరి ఈసినిమా రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూద్దాం.
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: