యంగ్ హీరో నితిన్ ఈమధ్య రూటు మార్చాడు. కాస్త డిఫరెంట్ గా ఉండే కథలతో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంత కాలంగా విభిన్న కథలు చేస్తోన్న నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం మాచర్ల నియోజక వర్గం. మొదటి సారి పొలిటికల్ నేపథ్యంలో నితిన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం అయితే హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా కృతి శెట్టిని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు ఈసినిమాలో కనిపించబోతున్నారు. కృతిశెట్టి ఆల్రెడీ ఫిక్స్ అవ్వగా మరో హీరోయిన్ గా కేథరిన్ ను ఎంపిక చేశారు. తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిగా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. కేథరిన్, నితిన్లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.
కాగా రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: