పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన ఒక్కొక్కరి షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ఓం రౌత్. ప్రభాస్.. కృతి సనన్, సైఫ్ అలీఖాన్.. సన్నీ సింగ్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా పూర్తి షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపట్టనున్నాడట ఓం రౌత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: