రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల చాలా లేట్ అయింది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దాదాపు ఏడాది నుండి వర్క్ చేస్తున్నారట. ఈవిషయాన్ని స్వయంగా ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ఈసినిమా గురించి క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. రాధే శ్యామ్ క్లైమాక్స్ గురించి దాదాపు ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ చాలా కీలకం.. ప్రేక్షకులను ఒప్పించడం అంత ఈజీకాదు.దీని కోసం దాదాపు ఒక ఏడాది పాటు ఆలోచించానని.. అందుకే క్లైమాక్స్ కోసం చాలా కష్టపడుతున్నాం.. దీనికోసం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. ప్రేక్షకులకు క్లైమాక్స్లో చాలా ఆసక్తికరమైన విషయాలు చూపించబోతున్నాం’ అని తెలిపారు.
కాగా ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022, జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: