ఇటీవలే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం తన తరువాత సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
Team #OkeOkaJeevitham wishes everyone a very Happy and prosperous Diwali 💖#ఒకేఒకజీవితం 🎸 #HappyDiwali @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees @JxBe @sujithsarang @sreejithsarang @prabhu_sr @DreamWarriorpic#Sharwa30 #OOJ pic.twitter.com/Onvrjn4jSD
— Sharwanand (@ImSharwanand) November 4, 2021
ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనుంది. ఈసినిమాలో రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తుండగా ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: