మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. దానికితోడు ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో ఇంకా లేట్ అయింది. ప్రస్తుతం అడివిశేష్ కోలుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకొని ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. తాజాగా అడివి శేష్ మళ్లీ కసరత్తులు మొదలుపెట్టాడు. తాజాగా ఆయన జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ మేజర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Guess who’s back 💯
Getting back into shape for #MajorTheFilm #FinalShoot pic.twitter.com/mezDC4Ml5P
— Adivi Sesh (@AdiviSesh) October 21, 2021
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: