‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి నుండి వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రెండో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతికి ఎంత టైం పట్టిందో చూశాం. అందులోనూ మల్టీస్టారర్ కావడంతో అది అంత ఈజీ కాదని కూడా సినిమా మొదలుపెట్టకముందే అజయ్ భూపతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ గా ఈసినిమా రేపు విడుదల కానుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ భూపతి కూడా మల్టీస్టారర్ గురించి చెబుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయడం అంటే ఆ హై వేరే లెవల్ లో ఉంటుంది.. దళపతి, విక్రమ్ వేదా లాంటి సినిమా తీయాలనుకున్నా అందుకే ఈ సినిమాను తీశానని అన్నారు. మహాసముద్రం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. ఫ్రెండ్ అంటే నాలుగు రోజులు కలిసి తిరిగి వెళ్లడం కాదు.. ఒక్కసారి మనం ఫ్రెండ్ అని అనుకుంటే.. వాడు చేసే తప్పులను, ఒప్పులను అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలని చెప్పే కథ అంటూ తెలిపాడు.
కాగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: