ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఇక రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. తాజాగా సైఫ్ తన షూటింగ్ పార్ట్ ను సైతం కంప్లీట్ చేసేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. ముందుగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో చేసే అవకాశం దక్కినందుకు చాాలా సంతోషంగా ఉంది. ఇక ప్రభాస్ తో పని చేయడం చాలా బాగుంది. ప్రభాస్ ఎప్పుడూ చాలా కూల్ గా ఉండే వ్యక్తి.. నేను అతనిని దగ్గరగా చూస్తూనే ఉన్నాను. అతడు బాహుబలి లాగా కనిపిస్తాడు. రాముడిగా మారినప్పుడు విభిన్నంగా కనిపిస్తాడు. అతనితో పని చేయడం చాలా గొప్పగా ఉంటుంది.. ప్రభాస్ పూర్తిగా జెంటిల్ మన్.. చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు.
కాగా ఈసినిమాలో సీతగా కృతీసనన్ నటిస్తుంది. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: