బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. తెలుగులో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదితి మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. ఇక ఆతరువాత వి సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ హీరోగా వస్తున్న సినిమా మహాసముద్రం. ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తుండగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తనకు ఎవరి బయోపిక్ లో నటించాలని ఉందో చెప్పుకొచ్చింది. ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.
కాగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్ద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: