మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుబాయ్ , హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న”సర్కారు వారి పాట” షూటింగ్ స్పెయిన్ దేశంలో జరుగుతుంది. స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. తనయుడు గౌతమ్ , తనయ సితార లతో కలిసి ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోని మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు . ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “సర్కారు వారి పాట” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: