ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా తీయడమే కష్టంగా ఉంటే మన హీరోలు మాత్రం వరుసపెట్టి సినిమాలు తీసేస్తున్నారు. ఇక యంగ్ హీరోల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోక్కరి ఖాతాలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నో బ్రేక్ అంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్పెయిన్ లో జరుపుకుంటుండగా.. నవంబర్ ఫస్ట్ వీక్ వరకూ ఈసినిమా షూటింగ్ పూర్తవనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఒక సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత మహేష్ మరో సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో తన ఫ్యామిలీతో కలిసి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈసారి మాత్రం అలా కాకుండా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈసినిమాను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట.
కాగా ఈసినిమాలో మహేష్ సరసన మరోసారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: