టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను తీసిన కొండపొలం సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మరోవైపు పవన్ తో హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత క్రిష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను వెంకీ తో చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొండపొలం సినిమాను నవల ఆధారంగా తెరకెక్కించిన క్రిష్ వెంకీ సినిమాను కూడా డా. కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు అనే కథ ఆధారంగా తీయబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈసినిమా కూడా అడవి నేపథ్యంలో ఉండబోతుంది అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగాప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నవంబర్ సెకండ్ వీక్ నుండి మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు. మొగలాయిల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. ఇక ఈసినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వలైన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: