ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో కటారు రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గురువారం ప్రత్యేక షో ద్వారా “కొండపొలం” చిత్రాన్ని చూసిన చిరంజీవి మాట్లాడుతూ .. “కొండపొలం” చిత్రంలో చక్కని మెసేజ్తో పాటు దర్శకుడు క్రిష్ మంచి లవ్ స్టోరీని తెరకెక్కించారనీ, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ గొప్ప చిత్రం వస్తుందనీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జనరల్గా క్రిష్ సినిమాలు అనగానే డిఫరెంట్ జానర్స్ ఫిల్మ్స్ అని మనం ఎక్స్ఫెక్ట్ చేస్తూ ఉంటామనీ , ‘కొండపొలం’ సినిమా ఓ థ్రిల్కి గురి చేస్తుందనేది మాత్రం వాస్తవమనీ , “కొండపొలం “చక్కటి రస్టిక్ లవ్ స్టోరీ అనీ , ప్రకృతిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పిన చక్కని కథాంశమనీ , ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఇచ్చిన మెసేజ్తో పాటు, చక్కని లవ్ స్టోరీ అనీ , ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ అద్భుతమనీ, మూవీ చూసి ఎంజాయ్ చేశాననీ , టీమ్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనీ చిరంజీవి చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: