జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య జై భీమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కరోనా వల్ల కొంతకాలం థియేటర్లు మూసేసినా ఈమధ్యే ఓపెన్ చేశారు. అయితే సూర్య మాత్రం తన సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన సంగతి కూడా విదితమే. ఈసినిమాను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగులో కూడా అదే రోజు స్ట్రీమింగ్ కానుంది.
కాగా ప్రొడక్షన్ బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. సంగీతం సీన్ రోల్డాన్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కధీర్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: