యంగ్ హీరోలు మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో విశ్వక్ సేన్ కూడా ఉన్నాడు. ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ వెంటనే వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తను డబ్బింగ్ చెబుతున్న పిక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
కాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈసినిమా
ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: