క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల.. ఇతర కారణాల వల్ల ఈసినిమా లేట్ అయిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వచ్చినప్పటికీ.. రంగమార్తాండ షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసి క్లారిటీ ఇచ్చాడు. ఫైనల్ గా ‘రంగ మార్తాండ‘ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది.. అంటూ షూటింగ్ స్పాట్కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శివాత్మిక, రాహుల్ కు సంబంధించి పాట చిత్రీకరణ జరుగుతుంది అన్నట్టు తెలిపారు.
Finalllllyyyy …. Rangamarthanda shoot resumed … maestro s eletrifying number being shot on shivathmika and rahulsipligunz and models …. Energies…. pic.twitter.com/ulyLmraONb
— Krishna Vamsi (@director_kv) September 27, 2021
ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. మరి ఎన్నో ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాతో అయినా మంచి విజయం సాధిస్తారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: